రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా జేసీబీతో ఏటీఎంను పెకలించి..

మహారాష్ట్రలో దొంగలు రెచ్చిపోయారు. సాంగ్లీలో ఏటీఎంను చోరీ చేశారు. మామూలుగా చోరీ జరిగితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.

Update: 2022-04-24 12:27 GMT

దొంగలు కూడా తెలివి మీరుతున్నారు. మామూలుగా దొంగతనం చేసే రోజులు పోయాయి. ఇది వరకూ ఏటీఎం ను పగలగొట్టో, కట్ చేసో సొత్తు దోచుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఏకంగా జేసీబీతో ఏటీఎంను పెకలించి ఎత్తుకుపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో దొంగలు రెచ్చిపోయారు. సాంగ్లీలో ఏటీఎంను చోరీ చేశారు. మామూలుగా చోరీ జరిగితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కానీ జేసీబీతో ఏటీఎంను పెకలించి తీసుకెళ్లడంతో.. ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఏటీఎం ను జేసీబీతో పెకలించి, దానిని జేసీబీలోనే వేసుకుని ఎత్తుకెళ్లారు చోరులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్. సోషల్ మీడియాలో అయితే.. నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. జేసీబీలతో నిర్మాణాలను కూల్చడమే కాదు.. దొంగతనాలు కూడా చేయొచ్చంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. మరి పోలీసులు ఈ కేసును ఎలా చేధిస్తారో చూడాలి.


Tags:    

Similar News