ఘోర ప్రమాదం... ఆరుగురు జవాన్ల మృతి

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు.

Update: 2022-08-16 07:45 GMT

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. అనేక మందికి గాయాలయ్యాయి. పహల్గాం లో ఇండియన్ టిబెట్ బోర్డర్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బస్సులో 39 మంది...
ప్రమాద సమయంలో బస్సులో 39 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. వీరంతా అమర్‌నాధ్ యాత్రలో విధులు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స ను అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఇద్దరు కశ్మీర్ పోలీసులు కూడా ఉన్నారు. అమర్‌నాధ్ నుంచి పహల్గామ్ లోని చందన్సారీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.


Tags:    

Similar News