Breaking : కర్ణాటకలో యాక్సిడెంట్.. 8 మంది ఏపీ వాసుల మృతి

కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ చిక్బల్లాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు

Update: 2023-10-26 04:01 GMT

kaleswaram kannepalli highway

కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ చిక్బల్లాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. టాటా సుమోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాధమికంగా అభిప్రాయపడుతున్నారు.

మరికొందరికి గాయాలు...
ఈ ప్రమాదలో మరికొందరు గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదస్థలిలో సహాయ కార్యక్రమాలను చేపట్టారు.


Tags:    

Similar News