సంచలన ఘటన.. రిమాండ్ కు శిల్ప

యాదాద్రి కలెక్టరేట్ లో తోటి ఉద్యోగిపై మహిళా ఉద్యోగి కత్తితో దాడి చేసిన ఘటన

Update: 2023-11-11 07:05 GMT

యాదాద్రి కలెక్టరేట్ లో తోటి ఉద్యోగిపై మహిళా ఉద్యోగి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆత్మకూర్ (ఎం) మండల ఏఓగా శిల్ప పనిచేస్తోంది. అదే మండలంలో మనోజ్​ ఏఈఓగా పనిచేసేవాడు. రైతువేదిక కారణంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొంతకాలంగా శిల్ప తన భర్త నుంచి దూరంగా ఉంటోంది. మనోజ్, శిల్ప సన్నిహితంగా ఉంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మనోజ్ ను అధికారులు యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇటీవలే మనోజ్ కొన్నినెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టాడు. శిల్ప, మనోజ్​ దూరంగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య పలుమార్లు ఫోన్​లో వాగ్వాదం జరిగింది. శిల్ప శుక్రవారం కలెక్టరేట్​లోని అగ్రికల్చర్​ ఆఫీసుకు వెళ్లారు. ఆ తర్వాత మనోజ్​ కూడా అదే ఆఫీసుకు వెళ్లాడు. ఆఫీసులోనే అందరి ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన వారిద్దరూ వెహికల్​ పార్కింగ్​ ప్లేస్​లో మరోసారి గొడవకు దిగారు. ఈ సమయంలోనే శిల్ప కత్తితో మనోజ్​ మెడపై దాడి చేసింది.

అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు మనోజ్​ను హాస్పిటల్​కు పంపించారు. దాడి ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని డీసీపీ రాజేశ్ చంద్ర తెలిపారు. తనపై మనోజ్​ దాడి చేయడానికి ప్రయత్నించడంతో తాను కత్తి తీసుకొని దాడి చేశానని శిల్ప పేర్కొంది. మనోజ్​ మాత్రం తాను కత్తి తేలేదని, శిల్పే కత్తి తీసుకొని తనపై దాడి చేసిందని చెప్పాడు. తాజాగా శిల్పను రిమాండ్ కు తరలించారు పోలీసులు. జూన్‌ 7, 2022లో రహస్య వివాహం కూడా చేసుకున్నామని శిల్ప చెప్పింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తనతోనే ఉండాలని మనోజ్‌ ఒత్తిడి చేశాడని.. వెంట బాబును తీసుకువస్తానని చెప్పగా వాడిని చంపేస్తానంటూ బెదిరించాడంటూ పోలీసులకు తెలిపింది. మూడు నెలల నుంచి తనను పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడని తెలిపింది.


Tags:    

Similar News