ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్‌టెక్‌ తదితర కారణాల ..

Update: 2023-10-24 03:26 GMT

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్‌టెక్‌ తదితర కారణాల వల్ల అమాయకులు బలైపోతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది. రోడ్డు ప్రమాదాలు జరిగి రోజంటూ ఉండదు. తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై వద్ద ఓ టాటా సుమోను బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. అయితే టాటా సుమోలో ఉన్నవారంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారుగా తెలుస్తోంది. తిరువన్నామలై అన్నామలైయార్‌ ఆలయం నుంచి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Tags:    

Similar News