అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై
AnanthapuramRoadAccident
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రాక్టర్ ను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.