రాజస్థాన్ లో దారుణం.. పసికందుని కెనాల్ లో పడేసిన తండ్రి

ఇటీవలే మేఘ్వాల్ భార్య మూడో బిడ్డ (ఆడపిల్ల)కు జన్మనిచ్చింది. ఆ పాప వయసు ప్రస్తుతం 5 నెలలు. ముగ్గురు పిల్లలు ఉంటే..

Update: 2023-01-24 05:34 GMT

రాజస్థాన్ లోని బికనీర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి చేసిన నిర్వాకమిది. తన మూడో బిడ్డ, నెలల పసికందును కాలువలోకి విసిరేశాడు. భార్యతో కలిసి ఈ ఘోరానికి పాల్పడగా.. భార్య భర్తలిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

బికనీర్ కు చెందిన జవార్ లాల్ మేఘ్వాల్ ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈరోజో రేపో ప్రభుత్వం తనలాంటి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుందని ఎదురుచూస్తున్నాడు. మేఘ్వాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మేఘ్వాల్ భార్య మూడో బిడ్డ (ఆడపిల్ల)కు జన్మనిచ్చింది. ఆ పాప వయసు ప్రస్తుతం 5 నెలలు. ముగ్గురు పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారని మేఘ్వాల్ కు ఇటీవలే తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు మూడో సంతానానికి జన్మనిస్తే.. ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ రూల్ ను కఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. దాంతో భయపడిన మేఘ్వాల్.. తన ఉద్యోగం ఊడేలా ఉందని భావించి మూడో బిడ్డను వదిలించుకోవాలనుకున్నాడు. తమ బిడ్డను తీసుకెళ్లి.. ఛత్తార్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కెనాల్ లో పారేసి వచ్చారు. వారిపో పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరినీ అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News