ప్రమాదానికి కారణం అదే

విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను పోలీసులు గుర్తించారు.

Update: 2022-10-23 08:16 GMT

విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను పోలీసులు గుర్తించారు. చిచ్చు బుడ్లు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. చిచ్చు బుడ్ల అన్ లోడ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.

అన్‌లోడ్ చేస్తుండగా...
ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కాగా మూడు బాణసంచా దుకాణాలు దగ్దమయ్యాయి. 16వ నెంబరు స్టాల్ లో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. చిచ్చు బుడ్లు వత్తిడికి లోనయి పేలి పోయి ఉండవచ్చని ఆయన తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసు కమిషనర్ తెలిపారు.


Tags:    

Similar News