బోధన్ అల్లర్ల వెనక కుట్ర కోణం

బోధన్ అల్లర్ల వెనక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. శివసేన కు చెందిన గోపి ప్రమేయం ఉదని గుర్తించారు.

Update: 2022-03-21 07:58 GMT

బోధన్ అల్లర్ల వెనక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. శివసేన కు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు గుర్తించారు. నెలరోజుల క్రితం బోధన్ మున్సిపాలిటీలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అయితే ఎప్పుడు విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న దానిపై కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శివసేనకు చెందిన గోపి, టీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ శరత్ తో కలసి శివాజీ విగ్రహ ప్రతిష్టకు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.

ఆ ఇద్దరి వల్లనే.....
ఎవరికీ తెలియకుండా గుప్పు చప్పుడు కాకుండా గోపి, శరత్ లు శివాజీ విగ్రహ ప్రతష్టాపన చేశారని పోలీసులు చెబుతున్నారు. అందువల్లనే అల్లర్లు చోటు చేసుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరి వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియవచ్చింది. పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


Tags:    

Similar News