భార్యను జీన్స్ వేసుకోవద్దన్న భర్త.. భార్య తీసుకున్న నిర్ణయం ఏమిటంటే

భార్యను జీన్స్ వేసుకోవద్దన్న భర్త.. భార్య తీసుకున్న నిర్ణయం ఏమిటంటే

Update: 2022-07-18 04:37 GMT

పెళ్లయిన తర్వాత జీన్స్‌ వేసుకోవద్దని అడ్డుకున్న భర్తను ఓ మహిళ కత్తితో పొడిచి చంపేసింది. జార్ఖండ్‌లోని జమ్తారాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జమ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామంలో ఈ సంఘటన నమోదైంది. శనివారం రాత్రి పుష్ప హెంబ్రోమ్ అనే మహిళ జీన్స్ ప్యాంట్ ధరించి గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చాక భర్త ఆ విషయాన్ని తప్పుబట్టాడు. బట్టల విషయంలో దంపతుల మధ్య బాగా గొడవ జరిగింది. వివాహం తర్వాత జీన్స్ ఎందుకు ధరించావని భర్త ఆమెను నిలదీశాడు. భర్త చేసిన వ్యాఖ్యలతో ఆమెకు చాలా కోపం వచ్చింది. అదే కోపంతో పుష్ప తన భర్తపై కత్తితో దాడి చేసింది. దీంతో ఆమె భర్త తీవ్రంగా గాయపడింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ధన్‌బాద్ పీఎంసీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి కర్ణేశ్వర్ తుడు మాట్లాడుతూ.. జీన్స్ ప్యాంట్ విషయంలో తన కొడుకు, కోడలు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఈ గొడవలో భార్య భర్తను కత్తితో పొడిచి చంపేసిందన్నారు.పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి, హత్య చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. "సంఘటన గురించి మాకు సమాచారం అందింది. బాధితుడు ధన్‌బాద్‌లో చికిత్స పొందుతూ మరణించినందున, ధన్‌బాద్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఈ విషయం దర్యాప్తు చేయబడుతోంది" అని జమ్తారా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు.



Tags:    

Similar News