ప్రేమోన్మాది రోహిత్ గురించి కీలక వివరాలు వెల్లడించిన నల్గొండ ఎస్పీ

రోహిత్ గురించి కీలక వివరాలు వెల్లడించిన నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి

Update: 2022-08-10 08:48 GMT

నల్గొండ పట్టణంలో తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడవంతో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. నవ్య, శ్రేష్ఠ అనే ఇద్దరు అమ్మాయిలు కలిసి మంగళవారం (ఆగస్టు 9) మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నల్గొండ పట్టణ శివార్లలోని ఫారెస్ట్ పార్క్ వద్దకు వచ్చారు. తాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వారు ఫారెస్ట్ ఆఫీస్ వద్దకు వచ్చారు. తాయితో పాటూ రోహిత్ (20) అనే యువకుడు కూడా అప్పటికే అక్కడ ఉన్నాడు. రోహిత్ గత ఏడు నెలలుగా నవ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నవ్యతో 20 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పిన రోహిత్.. ఆమెను పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా పొడిచాడు. కడుపులో, చేతులపై, కాళ్లపై, మొహంపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. నవ్య స్నేహితులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఆమెను తమ బైక్‌పై కూర్చోబెట్టుకొని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తనను ప్రేమించేందుకు ఒప్పుకోకపోవడంతోనే రోహిత్ బాధితురాలిపై దాడి చేశాడని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు. బుధవారం నాడు తన కార్యాలయంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వివరించారు. బాధితురాలితో మాట్లాడాలని తన స్నేహితుడి సహాయంతో పిలిపించి నిందితుడు మీసాల రోహిత్ ఈ దాడికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు. గతంలో కూడా రోహిత్ బాధితురాలిని వేధింపులకు గురి చేశాడని.. ఈ విషయాన్ని బాధితురాలు తన ఇంట్లో చెప్పలేదన్నారు. హైద్రాబాద్ లో ఉన్న తన సోదరుడికి ఫోన్ లో చెప్పిందన్నారు. అయితే ఈ విషయమై షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని తొలుత భావించారనుకున్నారని చెప్పారు. అయితే రోహిత్ ఇంట్లో ఈ విషయం చెబితే సరిపోతుందని బాధితురాలే తన సోదరుడికి చెప్పడంతో షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయలేదని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. ఈ ఘటన తర్వాత తన స్నేహితుడిని బతిమిలాడి నవ్యతో మాట్లాడేందుకు తన వద్దకు రప్పించాలని కోరాడు. చివరిసారి మాట్లాడి ఆమెను ఒప్పిస్తానని రోహిత్ తన స్నేహితుడికి చెప్పాడన్నారు. దీంతో రోహిత్ స్నేహితుడు ఈ సమాచారాన్ని బాధితురాలికి చేరవేసినట్టుగా ఎస్పీ తెలిపారు. మరో స్నేహితురాలితో కలిసి టూ వీటర్ పై మిర్యాలగూడ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉన్న పార్క్ వద్దకు బాధితురాలు చేరుకుందన్నారు అప్పటికే అక్కడే ఉన్న రోహిత్ బాధితురాలిని ప్రేమించమని వేధించాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో రోహిత్ బాధితురాలిపై దాడికి దిగినట్టుగా ఎస్పీ వివరించారు. రోహిత్ దాడి చేసే సమయంలో బాధితురాలు ప్రతిఘటించడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకొందన్నారు. ఆసుపత్రిలో ఆమెకు సర్జరీ చేశారని ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ రాజేశ్వరి వివరించారు. ఈ కేసు దర్యాప్తును డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తారన్నారు. తాను కూడా ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించనున్నట్టుగా కూడా ఎస్పీ చెప్పారు. యవతిపై రోహిత్ దాడి చేసి పారిపోయేందుకు పట్టణ శివారులో ఉన్న సమయంలో అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. రోహిత్ తో పాటు బాధితురాలు ఇద్దరూ క్లాస్ మేట్స్ అని ఎస్పీ తెలిపారు. ఈ తరహా వేధింపులకు పాల్పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.


Tags:    

Similar News