గుంటూరులో దారుణం.. మైనర్ బాలికతో ప్రియుడి స్నేహితులు

ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వెంగళాయపాలెంకి చెందిన మైనర్ బాలిక

Update: 2022-05-20 05:51 GMT

ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వెంగళాయపాలెంకి చెందిన మైనర్ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంస్టాగ్రామ్ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతడు ఆ పాపను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు ప్లాన్ వేసి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు.

గుంటూరు శివారుకు చెందిన బాలిక (15) ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్‌బాబుతో (19) బాలికకు పరిచయం ఏర్పడింది. గ్రేస్‌బాబు తన స్నేహితులైన వెలిచర్ల రిక్కీ (19), దామా మణికంఠ (19)లను ఆ బాలికకు పరిచయం చేశాడు. ఈ యువకులు ముగ్గురూ గుంటూరు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో ఓ హోటల్‌లో గది తీసుకుని మద్యం సేవించారు. ఒంటి గంటకు రిక్కీ ఆ బాలికకు వీడియోకాల్‌ చేసి గ్రేస్‌బాబు మద్యం తాగి హోటల్‌లో పడిపోయాడని, మీరొస్తేనే అన్నం తింటానంటున్నాడని నమ్మించాడు. ద్విచక్ర వాహనంపై ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేకపోవటంతో బైక్‌ ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు మద్యం తాగించి మత్తులోకి వెళ్లగానే రిక్కీ, మణికంఠలు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులు పనులు ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చే సరికి బాలిక ఇంట్లో లేకపోవటంతో పరిసరాల్లో వెతికారు. అత్యాచారం అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆ యువకులు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలేశారు. బాధితురాలి తల్లి నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు బాలికను జీజీహెచ్‌కు తరలించారు. మరో బృందం హోటల్‌కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. బాలిక స్నేహితుడు గ్రేస్‌బాబు నేరానికి పాల్పడలేదని నల్లపాడు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు నిందితులపై 376డీఏ, 366,363 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Tags:    

Similar News