బేస్ బాల్ బ్యాట్ తో తండ్రిని కొట్టి చంపిన కొడుకు

మృతుడి భార్య.. తన భర్తతో గొడవ పడి బంధువుల ఇంటికి వెళ్లానని, ఇంతలో తన భర్తను ఎవరో చంపేశారని..

Update: 2022-11-16 13:25 GMT

delhi crime news

తండ్రి ఏ పనీ చేయడు. తాగుడుకి కట్టు బానిస. రోజూ తాగి వచ్చి అమ్మను, అక్కను కొట్టడమే కాకుండా.. తన తాగుడు కోసం డబ్బులివ్వాలని అమ్మను వేధిస్తుంటాడు. ఇంట్లో రోజూ జరిగే ఈ తంతు చూసి కొడుకు విసిగిపోయాడు. ఎలాగైనా తన తండ్రిని చంపి.. తల్లికి, అక్కకు విముక్తి కలిగించాలని భావించాడు. అందుకు తల్లి, అక్క ఇంట్లో లేని సమయం కోసం ఎదురుచూశాడు. ఆ సమయం రానే వచ్చింది. బేస్ బాల్ బ్యాట్ తో తన తండ్రి కొట్టి హతమార్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని నేతాజీ సుభాష్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. ఓ వ్యక్తి నాలుగో అంస్తులోని తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడని తమకు సమాచారం వచ్చిందని.. అక్కడికి వెళ్లి చూసేసరికి ఓ వ్యక్తి రక్తపుమడుగులో అచేతన స్థితిలో పడి ఉన్నాడని తెలిపారు. మృతుడి భార్య.. తన భర్తతో గొడవ పడి బంధువుల ఇంటికి వెళ్లానని, ఇంతలో తన భర్తను ఎవరో చంపేశారని పోలీసులకు తెలిపింది. తమ సొంత ఊరు ఉత్తరాఖండ్ లోని చమోలీ అని, ఢిల్లీకి ఉపాధి కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నామని ఆ మహిళ వివరించిందని పోలీసులు పేర్కొన్నారు.
కాగా.. సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి చూశామని, అందులో హత్యకు సంబంధించిన ఆధారాలేవీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. బాలుడిపై అనుమానం వచ్చి, విచారించగా.. అతను చేసిన నేరాన్ని అంగీకరించాడని తెలిపాడు. అయితే.. బాలుడికి మరో ముగ్గురు స్నేహితులు కూడా సహకరించారించినట్లు తెలిసిందన్నారు. తన తల్లిని నిత్యం వేధించడం చూడలేకే.. తండ్రిని హతమార్చినట్లు బాలుడు వివరించాడని పోలీసులు పేర్కొన్నారు.


Tags:    

Similar News