సోదరి చితిమంటల్లో దూకిన యువకుడు

గమనించిన గమనించిన బంధువులు, గ్రామస్తులు ఆ యువకుడిని బయటకు తీసి.. మంటలను ఆర్పివేశారు. అనంతరం సమీపంలోని..

Update: 2023-06-02 08:02 GMT

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో క్యాన్సర్ తో మరణించిన స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లిన వ్యక్తి.. అతడి చితిమంటల్లో దూకి తీవ్రగాయాలతో మరణించిన ఘటన కలకలం రేపింది. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్ లోనూ వెలుగుచూసింది. భిల్వారా జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ అంత్యక్రియలకు వెళ్లాడు. ఆకస్మికంగా జరిగిన ఆమె మరణాన్ని తట్టుకోలేక బంధువులంతా కన్నీటితోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. యువతి చితికి నిప్పంటించగానే.. ఆ యువకుడు కూడా ఆ మంటల్లోకి దూకేశాడు.

గమనించిన గమనించిన బంధువులు, గ్రామస్తులు ఆ యువకుడిని బయటకు తీసి.. మంటలను ఆర్పివేశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా.. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. ఆ యువకుడు ఎందుకిలా చేశాడన్న కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై భివారా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందించారు. ఆసుపత్రి వర్గాల ద్వారా తమకు ఈ విషయం తెలిసిందని, 95 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న యువకుడు స్టేట్‌మెంట్ ఇచ్చే స్థితిలో లేడన్నారు. యువకుడు చితిమంటల్లో ఎందుకు దూకాడో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Tags:    

Similar News