బాగా తాగేసి వచ్చి సాంబార్ లో పడిపోయాడు

మద్యం మత్తులో కొందరు తాము ఏమి చేస్తున్నామో కూడా మరచిపోతూ ఉంటారు.

Update: 2022-08-03 10:51 GMT

మద్యం మత్తులో కొందరు తాము ఏమి చేస్తున్నామో కూడా మరచిపోతూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రోడ్డుపై కొందరు భోజనం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తూలుతూ అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తి.. కూర్చోడానికి ఇంకే ప్రాంతం లేదన్నట్లుగా.. సాంబార్ వండుతున్న పెద్ద పాత్రలో కూర్చోబోయాడు.. పక్కనే ఉన్న వ్యక్తులు అడ్డుకోడానికి ప్రయత్నించినా కూడా అతడు వినలేదు. ఏకంగా పెద్ద సాంబార్ గిన్నెలో ఇరుక్కుపోయాడు. షాక్ కు గురైన మిగిలిన వ్యక్తులు.. అతడిని బయటకు తీయడానికి చాలా కష్టాలు పడ్డారు. ఎంతలాగినా అతడు బయటకు రాలేకపోయాడు. పట్టుకుందామంటే వేడి వేడి పాత్ర.. పక్కన ఉన్న వ్యక్తులకు అతడు అసలు పట్టు చిక్కలేదు.. చివరికి ఓ వైపుకు సాంబార్ పాత్ర ఒరిగిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి సాంబార్ గిన్నెలో నుండి బయట పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

మధురైలో పలంగానట్టిలోని గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా గ్రామానికి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తి మద్యం తాగి తూలుతూ వంటలు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. భారీ పాత్రలో మండుతున్న సాంబారులో పడిపోయాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ముత్తుకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు.


Tags:    

Similar News