కల్తీ సారా : పదికి పెరిగిన మృతుల సంఖ్య

తమిళనాడులో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకూ కల్తీసారా తాగి పది మంది మరణించారు.

Update: 2023-05-15 04:02 GMT

తమిళనాడులో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకూ కల్తీసారా తాగి పది మంది మరణించారు. మరో పన్నెండు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు అధికారులపై ఇప్పటికే స్టాలిన్ సర్కార్ చర్యలు తీసుకుంది.

అధికారులపై వేటు...
ఇద్దరు ఇన్స్‌పెక్టర్లపై వేటు వేసింది. . తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్తీ సారా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణకు ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ సారా తయారు చేస్తున్న వారిపై దాడులను ముమ్మరం చేశారు.


Tags:    

Similar News