సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఇటీవలే అభినవ్ - సౌందర్య దంపతులు హైదరాబాద్ కు మకాం మార్చారు. నగరంలోని కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు.

Update: 2023-06-12 04:44 GMT

software engineer soundarya

ఓ భవనం పై నుండీ దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంషాబాద్ లో వెలుగుచూసింది. ఆత్మహత్యకు ముందుకు ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు తెలిపింది. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సౌందర్య(33)కు అదే ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్చర్ ఇంజినీర్ అభినవ్ తో 6 నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది. సౌందర్య మూడేళ్లుగా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది.

ఇటీవలే అభినవ్ - సౌందర్య దంపతులు హైదరాబాద్ కు మకాం మార్చారు. నగరంలోని కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు. జూన్8న ఆమె విధులకు బయల్దేరి.. శంషాబాద్ లో ఓ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెంటనే 100కు డయల్ చేసి చెప్పడంతో పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే సౌందర్య బిల్డింగ్ పై నుండి దూకి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 10 ఆదివారం నాడు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌందర్య తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే మరణించారు. జీవితం తాను ఊహించుకున్నట్లుగా లేదన్న బాధతో సౌందర్య చనిపోయిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. భర్త అభినవ్ ఇటీవలే ఉద్యోగం కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు.


Tags:    

Similar News