ముంబయిలో 120 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ముంబయిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 120కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Update: 2022-10-07 04:19 GMT

ముంబయిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 120కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాభై కేజీల మెఫెడ్రోన్ ను క్రైమ్ బ్రాంచ్ కు చెందని యాంటీ నార్కోటిక్స్ సెల్ ఈ డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయిలోని ఒక గోదాములో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.

గోదాములో ఉంచిన...
గోదాముపై దాడి చేసిన యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు ఎయిర్ ఇండియా మాజీ పైలట్ తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్ లో 120 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అధికారులు వివరించారు.


Tags:    

Similar News