కూతురిని గొంతు కోసి చంపిన తండ్రి.. కారణం ఏమిటంటే..!

తమ కుటుంబ పరువు తీశావంటూ ఆగ్రహించిన దేవిదాస్.. నడి రోడ్డుపై కూతురు గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులకు..

Update: 2022-05-27 11:29 GMT

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం నాగల్ కొండలో కూతురిని గొంతు కోసి చంపాడు ఓ తండ్రి. నాగల కొండ గ్రామానికి చెందిన పవార్ రాజేశ్వరి(21) మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన షేక్ అలీం అనే యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. రెండు వారాల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టి రాజేశ్వరిని, షేక్ అలీంను విడదీస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. తనకు భర్తే కావాలంటూ ఉదయం తండ్రి పవార్ దేవిదాస్ తో గొడవకు దిగింది.

తమ కుటుంబ పరువు తీశావంటూ ఆగ్రహించిన దేవిదాస్.. నడి రోడ్డుపై కూతురు గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులకు ఫోన్ చేసిన పవార్.. తన కూతురును ఎవరో చంపేశారంటూ సమాచారం ఇచ్చాడు. అలా పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో తండ్రి దేవిదాసే హత్య చేసినట్లుగా గుర్తించారు. తల్లి పవార్ సావిత్రి బాయి ఎదుటే కన్నబిడ్డను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News