హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం బయటపడింది.

Update: 2022-03-06 04:31 GMT

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం బయటపడింది. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా నిత్యం జరుగుతూనే ఉంది. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తూ పట్టుకుంటున్నా స్మగ్లర్లు కొత్త విధానంలో బంగారాన్ని చేరవేస్తున్నారు.

లో దుస్తుల్లో....
తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 1,144 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు తన లోదుస్తుల్లో పెట్టుకుని రాగా, కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. దీని విలు 62 లక్షలుగా కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News