బెంగళూరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

బెంగళూరులో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్ల నుంచి మూడు కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2022-01-30 03:02 GMT

బెంగళూరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్ల నుంచి మూడు కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నైజీరియన్లు బెంగళూరులోని సినీరంగానికి చెందిన వారితో పాటు పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు ఈ డ్రగ్స్ ను అందిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తొలిసారి ఆ డ్రగ్....
దీంతో పాటు తొలిసారిగా కర్ణాటకలో బ్లాక్ ఎండీఎంఏ డ్రగ్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ బ్లాక్ ఎండీఎంఏ కేవలం విదేశాల్లో మాత్రమే లభిస్తుందంటున్నారు. రాజణ‌్ణ లే అవుట్ లో నివసించే సక్టస్ హుచిక్, చుకుబమ్ హెన్రీలను పోలీసులు అదుపులోికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News