మంటల్లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు.. మహిళ సజీవ దహనం

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లో మంటలు వ్యాపించాయి.

Update: 2024-01-13 02:03 GMT

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లో మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ సజీవ దహనం అయింది. మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

సంక్రాంతికి వెళుతుండగా...
హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ప్రయివేటు బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి చౌరస్తా వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సజీవ దహనమయిన మహిళ బస్సులో నుంచి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె చేయి సీటుకు ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయింది. దీంతో ఆమె సజీవ దహనమయింది. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
నిద్రమత్తు కారణంగానే....
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన మహిళ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయివేటు బస్సుల యాజమాన్యం అధిక ఛార్జీలు వసూలు చేయడం తప్పించి సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News