ఫోన్లో మాట్లాడుతున్న కూతుర్ని.. పై నుండి తోసేసిన తండ్రి

దాంతో ఆమె డాబాపైకి వెళ్లి ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. అది చూసిన తండ్రి కూతురు ఎవరో యువకుడితో..

Update: 2023-02-11 04:00 GMT

కుమార్తె సెల్ ఫోన్ లో మాట్లాడుతుండగా.. ఆమెను అనుమానించిన తండ్రి.. డాబా పై నుండి కిందికి తోసేశాడు. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి.. ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా (ఉమ్మడి గుంటూరు) యడ్లపాడులో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

యడ్లపాడుకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని రెండ్రోజుల క్రితం ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి మందలించాడు. దాంతో ఆమె డాబాపైకి వెళ్లి ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టింది. అది చూసిన తండ్రి కూతురు ఎవరో యువకుడితో మాట్లాడుతోందని అనుమానించాడు. వెంటనే కుమార్తె గొంతుపట్టుకుని పై నుంచి కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు.


Tags:    

Similar News