బస్సులో మంటలు... తప్పిన ప్రమాదం

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి.

Update: 2023-02-04 03:27 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. అనాతవరం సెక్రటేరియట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నిలిపి ఉంచిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పుడు బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే డ్రైవర్ బస్సులో నుంచి దూకేశాడు.

డ్రైవర్ దూకడంతో...
ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఆగి ఉన్న బస్సుకు ఎవరైనా నిప్పు పెట్టారా? లేదా ఇంకేదైనా కారణం వల్ల బస్సులో మంటలు చెలరేగాయా? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News