బెజవాడలో ఈడీ దాడులు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు

Update: 2022-12-02 07:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఆసుపత్రుల్లో...
మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి ఆసుపత్రి డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు. అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సహకారంతో నగదును మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయి.


Tags:    

Similar News