కశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది దుర్మరణం

కిష్ట్వార్ జిల్లాలోని మర్వా ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తోన్న క్యాబ్ అదుపు తప్పడంతో..

Update: 2022-11-17 03:33 GMT

kashmir road accident

జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ క్యాబ్ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్ జిల్లాలోని మర్వా ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తోన్న క్యాబ్ అదుపు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను లోయలో నుండి వెలికి తీశారు.

ప్రమాదానికి గురైన వాహనాన్ని టాటా సుమోగా గుర్తించారు. ప్రమాదానికి గురైన ప్రాంతమంతా పర్వతప్రాంతం. మృతుల్లో ఏడుగురు మర్వాకు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు.


Tags:    

Similar News