మాచర్ల రాధను చంపింది అతడే.. కారం కొనడమే పట్టించిందా?

కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో హత్యకు గురైన డాక్టర్ మాచర్ల రాధ మర్డర్ మిస్టరీ వీడింది.

Update: 2023-08-12 04:42 GMT

కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో హత్యకు గురైన డాక్టర్ మాచర్ల రాధ మర్డర్ మిస్టరీ వీడింది. పిల్లల వైద్య నిపుణుడైన ఆమె భర్త లోక్‌నాథ్ మహేశ్వరరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అతడితో పాటు రాధ హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మధును కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ. 25 కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలే ఆమె హత్యకు కారణమని విచారణలో తేలింది.

మహేశ్వరరావు ఆస్తులను పోగొట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. 15 ఏళ్లుగా తన వద్ద నమ్మకంగా డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న మధుకు బంగారం, నగదు ఆశ చూపి ఈ హత్యకు ఒప్పించాడు. అనంతరం పక్కా ప్రణాళిక ప్రకారం గత నెల 25న రాధను చంపేశారు. రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న రాధ వద్దకు వెళ్లిన డ్రైవర్ మధుతో కలిసి భర్త లోక్‌నాథ్ వెళ్లాడు. మధు ఆమెను పట్టుకోగా భర్త ఆమె తల వెనక నుంచి ఆయుధంతో దాడిచేసి చంపేశాడు. పోలీసు కుక్కలకు దొరక్కుండా మధు ఆ ప్రదేశం మొత్తం కారం చల్లాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని నమ్మించేందుకు ఆమె నగలు లేకుండా చేశారు. ఏమీ ఎరగనట్టు కింది అంతస్తులోని ఆసుపత్రికి వచ్చి రోగులకు ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. 10.30 సమయంలో పోలీసులకు సమాచారం అందించాడు. భార్య చనిపోయిందన్న బాధ ఆయనలో కనిపించకపోవడంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడింది.
రాధ హత్య కేసులో A-1 ముద్దాయి మృతురాలి భర్త డాక్టర్ మహేశ్వరరావు అని తెలిపారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కారణంగా డ్రైవర్ జనార్ధన్ అలియాస్ మధుతో కలిసి డాక్టర్ మహేశ్వరరావు భార్యను హత్య చేసేందేకు ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు. జూలై 25న సాయంత్రం గ్యాస్ సిలిండర్ మూతలు ఓపెన్ చేసే రెంచ్ తో డ్రైవర్ మధు మృతురాలు మాచర్ల రాధ చేతులు వెనక్కి విరచి పట్టుకోగా భర్త డాక్టర్ మహేశ్వరరావు నాలుగు సార్లు బలంగా భార్య తలపై కొట్టగా ఆమె స్పృహతప్పి పడిపోయారని చెప్పారు.అనుమానం వచ్చి మళ్ళీ చనిపోయే వరకు ఆమెను కొట్టారు. కారంను సైతం హత్య స్థలానికి ఒక కిలో మీటరు దూరంలో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు విచారణలో బయటపడినట్లు చెప్పారు.


Tags:    

Similar News