Breaking : విజయవాడ లో బ్రేకు ఫెయిల్ అయి ప్లాట్‌ఫారంపైకి బస్సు... ఇద్దరు మృతి

బ్రేకులు ఫెయిల్ అయినా ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి దూసుకు రావడంతో కండక్టర్, ఒక ప్రయాణికురాలు మృతి చెందారు

Update: 2023-11-06 04:03 GMT

ఆర్టీసీ బస్సు విజయవాడలో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అయినా ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి దూసుకు రావడంతో కండక్టర్, ఒక ప్రయాణికురాలు మృతి చెందారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్టాండ్ ప్రయాణికులతో రద్దీ గా ఉంది.

విజయవాడ బస్టాండ్‌లో....
డిపో నుంచి ఆర్టీసీ బస్టాండ్ లోకి వస్తున్న సందర్భంలో వేగంగా వచ్చి బస్టాండ్ లోని ప్లాట్‌ఫారం పైకి రావడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయినందునే ప్లాట్‌ఫారంపైకి దూసుకువచ్చిందా? మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News