చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో భారీ పేలుడు

చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కుప్పం పట్టణంలోని కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇం

Update: 2023-06-26 03:20 GMT

చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కుప్పం పట్టణంలోని కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు జరిగింది. నాటు బాంబు, జిలెటిన్ స్టిక్స్ పేలినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఆ ఇంట్లోని మురుగేష్, ధనలక్ష్మీ దంపతులకు గాయాలు అయ్యాయి. గుర్తు తెలియని దుండగులు ఆ దంపతుల ఇంటి గుమ్మం వద్ద పేల్చినట్లు చెబుతున్నారు. నాటు బాంబు, జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పేలుడుదాటికి ఇల్లు ధ్వంసం కాగా.. దంపతుల పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వారిని కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

మురుగేష్, ధనలక్ష్మి దంపతులు స్థానికంగా స్టీల్ పాత్రలు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కుప్పం ఉలిక్కి పడింది. గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాలను ప్రయోగించడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దే నాటు బాంబు, జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Tags:    

Similar News