భారీ వర్షంలో.. పట్టపగలు దర్జాగా బైక్ చోరీ

ఈ ఘటన కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పుష్పంధర్ అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో..

Update: 2023-07-21 04:59 GMT

splendor plus bike theft

దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు అర్ధరాత్రి సమయంలో దొంగతనం చేయడమే కాకుండా ఇప్పుడు పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనానికి పాల్పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం భారీగా వర్షం కురుస్తున్న సమయంలో ఓ దొంగ గుడి వద్ద పార్కు చేసి ఉన్న బైక్ ను తనదై అన్నట్లుగా బైక్ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటన కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పుష్పంధర్ అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కామటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ స్మశాన వాటికకు ఎదురుగా ఉన్న శివాలయానికి వెళ్ళాడు. ఈ క్రమంలో పుష్పందర్ తన splendor plus (AP12N4563) బైక్ ను గుడి ఎదురుగా పార్క్ చేసి దైవదర్శనానికి వెళ్ళాడు. అయితే భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఓ దొంగ గుడి వద్దకు వచ్చి అటు ఇటు చూసి.. పార్క్ చేసి ఉన్న బైక్ ను తన బైకే అన్నట్టుగా దర్జాగా స్ప్లెండర్ ప్లస్ బైక్ తీసుకొని అక్కడనుండి నెమ్మదిగా జారుకున్నాడు.

రెండు వాహనాల మధ్య పార్క్ చేసి పెట్టిన కూడా పక్కన ఉన్న బైకులను జరిపి మధ్యలో పార్క్ చేసి ఉన్న స్ప్లెండర్ ప్లస్ బైక్ ను మాత్రమే దొంగ తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే రెండు బైక్ల మధ్య తన బైక్ సురక్షితంగా ఉంటుందని అనుకున్న పుష్పెంధర్ కొద్దిసేపటి తర్వాత గుడి నుండి బయటకు వచ్చి బైకు చూడగా తన బైక్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. తన బైక్ దొంగతనం జరిగిందని బాధితుడు కామటిపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అయితే దొంగ ఎంతో హుందాగా బైక్ ని తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. వాటిని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News