Bengaluru : బెంగళూరులో అమానుషం

క్యాబ్‌ డ్రైవర్‌ తన కస్టమర్‌పై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో బయటపడింది

Update: 2025-10-25 05:58 GMT

క్యాబ్‌ డ్రైవర్‌ తన కస్టమర్‌పై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో టోల్‌ రూట్‌ దాటకుండా డ్రైవర్‌ వెళ్లడం‌పై 19 ఏళ్ల విద్యార్థిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో డ్రైవర్‌ ఆమెపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటన అక్టోబర్‌ 20న జరిగినట్టు పోలీసులు తెలిపారు.

క్యాబ్ డ్రైవర్...
కేరళలోని త్రిసూర్‌కు చెందిన అజాస్‌ గా నిందితుడిని గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఆ విద్యార్థిని బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. ఆమె విమానాన్ని అందుకోవడానికి ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకుని బయలుదేరిందని బాధితురాలి మామ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఈ దాడికి దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Tags:    

Similar News