యూట్యూబ్ పై ఏపీ హైకోర్టు సీరియస్

యూట్యూబ్ పై సీరియస్ అయింది ఏపీ హై కోర్టు. కొత్త టెక్నిక్ తో అమెరికాలో ఉండే పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి ఫేక్..

Update: 2022-02-21 14:06 GMT

సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసుపై ఏపీ కోర్టు నేడు విచారణ చేసింది. ఈ కేసులో యూట్యూబ్ పై సీరియస్ అయింది ఏపీ హై కోర్టు. కొత్త టెక్నిక్ తో అమెరికాలో ఉండే పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి ఫేక్ యూజర్ ఐడీతో యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వినీ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫేక్ యూజర్ ఐడీతో అడిగిన వారికి వ్యూస్ ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవ పరుస్తున్నారని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పంచ్‌ ప్రభాకర్‌ గురించి ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. పంచ్‌ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారని సీబీఐని ప్రశ్నించింది. అతను అమెరికాలో ఉండడంతో ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. దీంతో.. మార్చి 21వ తేదీలోపు ప్రభాకర్‌ అరెస్ట్‌కు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో హైకోర్టుకి నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ప్రైవేట్‌ వ్యూస్‌ నిషేధించడానికి తీసుకుంటున్నచర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.


Tags:    

Similar News