అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది

Update: 2024-04-06 03:15 GMT

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే మృతుడి స్వస్థలంతో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపడానికి అవసరమైన సాయం అందిస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

పోలీసులు దర్యాప్తు...
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్‌’ లో తెలిపారు. ఈ ఏడాదిలో వరసగా ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం కావడంతో అమెరికాలో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో వరసగా భారతీయుల మరణాలపై కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు.


Tags:    

Similar News