విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి యత్నం

విశాఖపట్నం రైల్వే ఎక్స్ ప్రెస్ లో చోరీకి యత్నించిన ఘటన వెలుగు చూసింది

Update: 2025-06-29 02:44 GMT

విశాఖపట్నం రైల్వే ఎక్స్ ప్రెస్ లో చోరీకి యత్నించిన ఘటన వెలుగు చూసింది. అయితే రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. గంటూరు జిల్లా పిడుగు రాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లు దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రౌండ్లు రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.

ఏడుగురు గ్యాంగ్...
ఈ గ్యాంగ్ లో మొత్తం ఏడుగురున్నట్లు తెలిసింది. రిజర్వేషన్ బోగీలలో చోరీకి ప్రయత్నం చేయడంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న ఈ రైలులో చోరీకి పాల్పడుతున్నట్లు తెలిసింది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన అని ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి యత్నించడంతో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News