యూపీలో దారుణం.. టీచర్ కొట్టడంతో దళిత విద్యార్థి మృతి

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు కొట్టడంతో దళిత విద్యార్థి మృతి చెందాడు.

Update: 2022-09-27 04:41 GMT

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు కొట్టడంతో దళిత విద్యార్థి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ లోని ఔరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిఖిల్ డోహ్రే అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే పరీక్షల్లో ఒక పదం తప్పుగా రాసినందుకు సోషల్ టీచర్ అశ్విని సింగ్ ఆ విద్యార్థిని దారుణంగా కొట్టారు. దీంతో నిఖిల్ డోహ్రేని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.

పదం తప్పుగా రాశాడని...
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిఖిల్ డోహ్రే మరణించారు. దీంతో ఆ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పదం తప్పు రాసినందుకు చనిపోయేలా కొట్టిన టీచర్ అశ్విని సింగ్ పై పోలీసులకు అతని తండ్రి రాజు డోహ్రే ఫిర్యాదు చేశారు. టీచర్ కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన రాజు డేహ్రే ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News