మిర్యాలగూడలో 5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత

ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ వద్ద భారీగా బంగారం పట్టుబడింది.

Update: 2024-03-19 01:54 GMT

ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మిర్యాలగూడ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. మిర్యాలగూడ లోని ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో భారీగా బంగారాన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వాహనంలో తనిఖీలు చేస్తుండగా...
మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళుతున్న వాహనంలో ఈ బంగారం పోలీసులకు పట్టుబడింది. ఈ బంగారం విలువ 5.73 కోట్ల రూపాయలని పోలీసులు తెలిపారు. ఈ వాహనంలో వెళుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది వ్యాపారం నిమిత్తం తీసుకెళుతున్నారా? లేక ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకెళుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News