రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ప్రియుడు ఆత్మహత్య

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమెతో ఉన్న వ్యక్తి ఇంటికెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Update: 2021-12-04 10:09 GMT

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమెతో ఉన్న వ్యక్తి ఇంటికెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీడీ కాలనీలో ఉంటున్న ఈ జంట శనివారం తెల్లవారుజామున వేరే ఊరి నుంచి ద్విచక్ర వాహనంపై ఏలూరుకి తిరిగి వస్తున్నారు.

ఇంటికెళ్లి ఉరేసుకుని....
ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. వెంటనే ఆమెతోపాటు ఉన్న వ్యక్తి తన ఇంటికెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ ఘటనల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News