మైనర్ బాలికపై అత్యాచారం, హత్య

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక, ఏపీ సరిహద్దులోని గిలకనూరు క్యాంపులో 13 ఏళ్ల బాలికపై

Update: 2023-07-14 10:25 GMT

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక, ఏపీ సరిహద్దులోని గిలకనూరు క్యాంపులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను హత్య చేశారు. తరువాత శవాన్ని చెట్టుకు వేలాడ దీశారు. శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలిని బుడగజంగాల సామాజిన వర్గానికి చెందిన యువతిగా గుర్తించారు. 13 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి మంత్రాలయం పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ చిల్లర వస్తువులు అమ్ముతుండేది. ఈ క్రమంలోనే బాలికపై ముగ్గురు యువకులు కన్నేశారు.

గురువారం నాడు త్వరగా ఇంటికి వచ్చిన బాలికకు ఇంటి పక్కనున్న ముగ్గురు మాయమాటలు చెప్పి సమీప పొలాల్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం బయటకు వస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని బాలికను హత్య చేసి.. చున్నీతో చెట్టుకు ఉరివేశారు. ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. 

Tags:    

Similar News