ఆటో ఢీ.. ఆరుగరి మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు

Update: 2022-07-18 12:42 GMT

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీనీ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో నుజ్జునజ్జు అయింది. ఆటో రాంగ్ రూట్ లో వచ్చి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కామరెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం మెనూర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

రాంగ్ రూట్ లో....
ఆటో రాంగ్ రూట్ లో వస్తూ లారీని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. క్షతగాాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News