ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు

Update: 2022-11-30 03:19 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది. ఆరుగురిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినా ప్రాణాలు మాత్రం దక్కలేదు.

భారీ అగ్ని ప్రమాదం...
ఫర్నిచర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారుక. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆరుగురిని రక్షించలేకపోయామని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తేగలిగారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు.


Tags:    

Similar News