దారుణం.. 13 ఏళ్ల చిన్నారిపై 80 మంది అత్యాచారం

పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు అడిషనల్ ఎస్పీ సుప్రజ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి..

Update: 2022-04-20 08:54 GMT

గుంటూరు : తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఘటన జరిగింది. 13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన మహిళను సవర్ణకుమారి అనే పరిచయం చేసుకుని, ఆమె కూతుర్ని దత్తత తీసుకుంటున్నట్లు నటించి, తల్లి చనిపోగానే చిన్నారిని బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపింది. నిన్న చిన్నారిని గుంటూరు బ్రోతల్ హౌస్ నుంచి విడిపించి, బయటకు తీసుకొచ్చారు పోలీసులు.

ఈ కేసులో మొత్తం 80 మందిని అరెస్ట్ చేసి, ప్రధాన నిందితురాలైన సవర్ణకుమారిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు అడిషనల్ ఎస్పీ సుప్రజ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో తొలి అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు బాలికను విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. 8 నెలల పాటు తెలంగాణ, ఏపీల్లోని వివిధ ప్రదేశాలకు ఆ చిన్నారిని వ్యభిచారం కోసం తిప్పారు. చిన్నారి వయసు, ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరాగా తీసుకుని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టారని, పలుమార్లు అమ్మేశారని ఏఎస్పీ సుప్రజ చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడల్లో నిందితులను అదుపులోకి తీసుకుని 53 సెల్ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News