కరీంనగర్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. బయటికి పొక్కకముందే విదేశాలకు పరార్

మతిస్థిమితం సరిగ్గా లేని మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు.

Update: 2022-05-04 13:47 GMT

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మతిస్థిమితం సరిగ్గా లేని ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు నీచానికి ఒడిగట్టారు. బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. చందుర్తి మండలం నర్సింగాపూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరు విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల మైనర్ బాలికకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఆమె ఇంటికి సమీపంలో నివాసముంటున్న కనకయ్య, లచ్చయ్య అనే ఇద్దరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ విషయం బాలిక తల్లికి ఆలస్యంగా తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితుల్లో కనకయ్యను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు విషయం బయటికి పొక్కకముందే విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News