చంద్రబాబు వెళ్లాకే ఆ లెటర్ మాయమైంది

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-08-03 13:04 GMT

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి మృతి మిస్టరీగా మారిందన్నారు. ఆత్మహత్యకు ముదు ఉమామహేశ్వరి లెటర్ రాసిందని ఆమె చెప్పారు. చంద్రబాబు అక్కడకు వెళ్లిన తర్వాత ఆ లెటర్ మాయమయిందన్నారు.

మిస్టరీ గా ఉంది....
ఉమామహేశ్వరి మృతి వెనక ఏదో ఉందని లక్ష్మీపార్వతి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబానికి శనిలాంటోడని ఆమె విమర్శించారు. ఈ మిస్టరీని బయటకు తీయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు తెలియజెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.


Tags:    

Similar News