చిత్తూరులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. డిప్యూటీ సీఎం వార్నింగ్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం

Update: 2022-01-15 07:07 GMT

చిత్తూరు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కార్యాలయం ముందున్న వైఎస్సార్ విగ్రహం చెయ్యి, ముఖాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

ఎస్ ఆర్ పురంలో జరిగిన ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘాటుగా స్పందించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన నేతల తోలు తీస్తామని డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ వార్నింగ్ ఇచ్చారు.




Tags:    

Similar News