ధర్మవరంలో సూరి వర్గీయులపై దాడి

ధర్మవరం బీజేపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Update: 2022-06-28 08:00 GMT

ధర్మవరం బీజేపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. స్కార్పియో వాహనాల్లో వచ్చిన వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రెస్ క్లబ్ లో...
వైసీపీ ప్లీనరీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వాలనుకున్నారు. గత కొంతకాలంగా వరదాపురం సూరి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వర్గీయుల మధ్య మాటల దాడి జరుగుతుంది. అది ఈరోజు భౌతిక దాడిగా మారింది. బీజేపీ నేతలు అనే కన్నా సూరి వర్గీయులపై దాడి అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ కంటే వరదాపురం సూరి వ్యక్తిగత అనుచరగణమే ఎక్కువన్నది వాస్తవం.


Tags:    

Similar News