Ys Sunitha : అన్నా బ్యాండేజీ తీయండి.. గాలి తగిలితే దెబ్బ మానుతుంది

జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సూచించారు.

Update: 2024-04-25 12:42 GMT

జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సూచించారు. సునీత మీడియా సమావేశంలో మాట్లాడారు. గాలి తగిలితే దెబ్బ త్వరగా మానిపోయే అవకాశం ఉందని, ⁠ఓ వైద్యురాలిగా జగన్‍రెడ్డికి సలహా ఇస్తున్నానని చెప్పారు. ⁠జగన్ కోసం వివేకా పదవిని త్యాగం చేశారని, ⁠ఇన్నీ చేశాక కూడా మీకు ఎందుకింత ద్వేషం? అని ప్రశ్నించారు. వివేకాను చంపేంత ద్వేషం ఎందుకొచ్చింది? అని అన్న సునీతా ⁠వివేకా మీకు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. జగన్ ప్రసంగంలో వివేకా హత్య గురించి ప్రస్తావించారని, ఆయన గురుంచి జగన్ నెగెటివ్‍గా మాట్లాడారన్నారు. ⁠వివేకా గురించి మాట్లాడటానికి ఒక్క మంచి మాట కూడా గుర్తుకు రాలేదా?అని నిలదీశారు. ⁠కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే జగన్‍కు గౌరవం ఉందా? అని అన్నారు. ⁠నిందితులు ఎవరో సీబీఐ చెప్పిందని, కానీ సీబీఐపై నమ్మకం లేదని జగన్ అంటున్నారన్నారు.

నా భర్తను అరెస్ట్ చేయండి...
అసలు జగన్‍కు ఏ వ్యవస్థపై నమ్మకముంది అని ప్రశ్నించారు. ⁠గతంలో నా భర్తపై జగన్ అనుమానం వ్యక్తం చేశారని, ⁠నిందితులు ఎవరైనా శిక్షించాల్సిందేనని మా అమ్మ అన్నారన్నారు. ⁠ఎవరు చేశారో దేవుడికి, కడప ప్రజలకు తెలుసని జగన్ అంటున్నారని, ⁠ఎవరు చేశారో సీఎంగా ఉన్న జగన్‍కు తెలియదా? అంటూ మండిపడ్డారు. ⁠తప్పు చేసింది నా భర్త అయితే.. ఆయన్ను అరెస్ట్ చేయండని, తాను అయినా .. తన భర్త అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని అన్నారు. ⁠అవినాష్ పిల్లాడు అని జగన్ అంటున్నారని, పిల్లాడు అయితే స్కూల్‍కు పోవాలని, ⁠పిల్లాడికి ఎంపీ టికెట్ ఇవ్వరని సునీత ఎద్దేవా చేశారు - ⁠నిందితుల్ని జగన్ ప్రోత్సహించవద్దని, వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నానని, ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయా?
అంటూ సునీత ప్రశ్నించారు.


Tags:    

Similar News