Ys Sharmila :ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు : వైఎస్ షర్మిల
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటించారు. రైతులను పరామర్శించారు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటించారు. రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడారు. పెడన నియోజక వర్గం బంటుమిల్లి మండలంలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల - మొంథా తుపాను కారణంగా రైతులు సర్వం కోల్పోయారన్నారు. తుపాను బీభత్సం సృష్టించిందని, ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయన్నారు. అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారన్న వైఎస్ షర్మిల ఇప్పుడు తుపాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆవేదన చెందారు. పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని, ముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. నష్టం ఎక్కువ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమో ? అని షర్మిల అన్నారు.