Ys jagan : అమరావతి కాదు.. మావిగన్ అని పెట్టండి
రాజధాని అమరావతిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
రాజధాని అమరావతిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ 110 కిలోమీటర్లు ఉంటుందని, దానిని రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని జగన్ అన్నారు. మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు అంటే చంద్రబాబుకు నచ్చలేదని, అక్కడ అవినీతి చేయడానికి వీల్లేదని భావించి అమరావతిని చంద్రబాబు ఎంచుకున్నారని జగన్ అన్నారు.
నలభై లక్షల జనాభా ఉన్న...
నలభై లక్షలు జనాభా ఉన్న ప్రాంతంలో కాస్త ఖర్చు పెడితే గ్రోత్ ఇంజిన్ గా మహానగరం గా మారుతుందని అన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను రాజధానిగా చేసి మావిగాన్ పేరు పెట్టాలని అన్నారు. తాము ఈ ప్రతిపాదనను సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.