Andhra Pradesh : చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ ను అందించనుంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని నేటి నుంచి అమలు చేయనుంది. ఇది వరకే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన నేటి నుంచి అమలు కానుంది.
ఐదు వందల యూనిట్ల వరకూ...
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనే మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా అందించనున్నారు. చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది.