మాగుంట విచారణ కూడా నేడే

వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది

Update: 2023-03-21 02:11 GMT

వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆయన ఈ నెల 18వ తేదీన హాజరు కావాలని ఈడీ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. అయితే మాగుంట సోదరుడు కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన చెన్నైలోనే ఉండిపోయారు. తాను ఈరోజు హాజరు కాలేనని ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.

ఇద్దరినీ కలిపి...
దీంతో మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకూడా నేడు హాజరుకానుండటంతో ఇద్దరినీ కలసి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశముందని చెబుతున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు.


Tags:    

Similar News